హైదరాబాద్: బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ లోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం తెలిపారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం ప్రార్థించారు.
పబ్లిక్ హియరింగ్ లో స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్ను నియమించాలి -డిమాండ్
పబ్లిక్ హియరింగ్లోస్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్ను నియమించాలి -డిమాండ్ కులగణన పై పబ్లిక్ హియరింగ్లో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు సమగ్ర ఇంటింటి కులసర్వేలో ప్రామాణిక...
Read more