హైదరాబాద్: బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ లోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం తెలిపారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం ప్రార్థించారు.
బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్
బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...
Read more