నగరంలోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం జరిగిన\n ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దాంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అప్రమత్తమైన అక్కడి సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో వెల్డింగ్ పనులు చేస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
వృత్తి కులాల సేవలు రుణం తీర్చుకోనివి - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వృత్తిదారుల కుటుంబాలకు ఒక లక్ష ఆర్ధిక చేయూత అతి...
Read more