నగరంలోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం జరిగిన\n ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి. దాంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అప్రమత్తమైన అక్కడి సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో వెల్డింగ్ పనులు చేస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...
Read more