రుద్రప్రయాగ్ :ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14న తెరుచుకోగా.. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి “డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి… బీసీలకు న్యాయం చేయాలంటే కులగణనే మార్గం” జాతీయ బీసీ...
Read more