• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

జీఎస్టీ గరిష్ఠంగా 5 %

TP NewsbyTP News
25/12/2018
inBusiness
0
gst

వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో మరిన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలపై పన్ను భారం అతి తక్కువగా ఉండేలా చేయాలనుకుంటోంది. చాలా వస్తువులపై అసలు పన్నే ఉండకూడదని, ఉన్నా గరిష్ఠంగా 5 శాతానికి మించకూడదని భావిస్తోంది. దేశంలో అంతిమంగా సున్నా- అయిదు శాతం పన్ను రేట్లే  ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆకాంక్షించారు. జీఎస్టీ అమలుతో ఎగవేతలు తగ్గి, వసూళ్లు బాగా పెరుగుతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులో ఇప్పుడున్న 12-18% రేట్లను ఏకం చేసి మధ్యలో మరో రేటు తీసుకొస్తామని తన ప్రణాళికను వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి 18 నెలలు పూర్తయిన సందర్భంగా ఆయన తన ఫేస్‌బుక్‌ బ్లాగ్‌లో ప్రత్యేక కథనం రాశారు.

అప్పట్లో 31% పన్ను
‘‘ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత దారుణమైన పరోక్ష పన్నుల విధానం ఉన్న దేశం భారత్‌. పన్నులు వేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉంది. రెండూ కలిపి 17 రకాల పన్నులు వేసేవి. వీటి తనిఖీకి 17 మంది ఇన్స్‌పెక్టర్లు ఉండేవారు. వ్యాపారులు 17 రిటర్నులు, 17 అసెస్‌మెంట్లను సమర్పించాల్సి వచ్చేది. పన్ను భారం కారణంగా ఎక్కువ మంది ఎగ్గొట్టడానికే మొగ్గు చూపేవారు. అంతర్రాష్ట్ర వాణిజ్యం దారుణంగా ఉండేది. చెక్‌పోస్టుల వద్ద వాహనాలు రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటినుంచి పరిస్థితుల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. 17 రకాల పన్నులు ఒక్కటయ్యాయి. భారత్‌ మొత్తం ఏకమార్కెట్‌గా అవతరించింది.

50 శాతం పెరిగిన ఆరు రాష్ట్రాల ఆదాయం
జీఎస్టీ విధానంలో రాష్ట్రాల ఆదాయ లక్ష్యాలు గతంలో ఎన్నడూ లేనంతస్థాయికి పెరిగాయి. ప్రతి రాష్ట్రానికీ ఏటా 14% ఆదాయవృద్ధి ఉండేలా భరోసా ఇచ్చాం. ఆరు రాష్ట్రాల ఆదాయం దాదాపు 50% పెరిగింది. మరో ఏడు రాష్ట్రాలు ఆ లక్ష్యానికి చాలా దగ్గరలో ఉన్నాయి. ఇంకో 18 రాష్ట్రాలు ఈ దిశగా పోటీపడుతున్నాయి. 14% వృద్ధిరేటు సాధించలేని రాష్ట్రాలకు పరిహారం కూడా చెల్లిస్తున్నాం. జీఎస్‌టీ కారణంగా వస్తువుల రేట్లు బాగా తగ్గాయి. దీన్ని డబ్బు రూపంలోకి మారిస్తే ఏటా రూ.80వేల కోట్ల మేర ప్రజలకు ఆదా అయింది. తొలి ఏడాది ప్రతి నెలా రూ.89,700 కోట్లు జీఎస్టీ వసూలయితే రెండో ఏడాది నెలకు సగటున రూ.97,100 కోట్లు వస్తోంది.

మొత్తంగా చూస్తే జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్నులు తగ్గాయి, పన్ను పరిధి పెరిగింది, వసూళ్లు పెరిగాయి, ఎగవేతలు తగ్గాయి, ధరలూ తగ్గాయి. వాణిజ్యం సులభతరంగా మారింది. జీఎస్టీ మండలి ఇప్పటివరకూ 31 సార్లు సమావేశమయింది. ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తోంది. రాజకీయపార్టీల గళాలు బయట ఎలా ఉన్నప్పటికీ మండలి సమావేశాల్లో మాత్రం అందరూ చాలా సౌహార్దపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. సమాఖ్యవ్యవస్థలో ఇదో తొలి ప్రయోగం’’. అని పేర్కొన్నారు.

Tags: GST
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

by Admin
15/06/2025
0

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

08/06/2025
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News