సోమవారం నాడు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఓబీసీ విద్యార్థి నాయకుడు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రస్తుత రాజకీయాలలో బీసీల పాత్ర అనే అంశంపై చర్చించడానికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్,తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు, సీనియర్ బీసీ నాయకుడు పటాన్చెరు నియోజకవర్గానికి చెందినటువంటి నీలం మధు ముదిరాజ్ వస్తున్నట్లు కార్యక్రమం నిర్వాహకులు రాష్ట్ర అధ్యక్షులు శివ ముదిరాజ్ తెలియజేశారు. ఇందులో భాగంగా యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో కరపత్రాలు మరియు గోడ పత్రికలను విడుదల చేయడం జరిగుతుందని స్థానికంగా ఉన్న బీసీ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు హాజరై తమ మద్దతు తెలియజేయాలనీ కోరారు.
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...
Read more