పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గీత కార్మిక సోదరుడు మజ్జుల రాజు తాటిచెట్టు ఎక్కుతుండగా విష సర్పము {పాము} కరవడంతో మరణించగా, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 4,000 రూపాయల ఆర్థిక సహాయం వారికి అందించారు. అనంతరం కట్ల లక్మీకి 50 కిలోల బియ్యం అందించారు. కట్ల కొమురయ్యకి 50 కిలోల బియ్యం అందించారు. ఇటీవల మరణించిన వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను నల్ల మనోహర్ రెడ్డి పరామర్శించారు. వారి వెంట తనుగల శ్రీనివాస్, అల్లం శంకర్ ,MD చాంద్ పాష ,మేకల కుమార్ MD రఫీ తదితరులు ఉన్నారు
మహిళా సాధికారతకు అద్భుత వేదిక
మహిళా సాధికారతకు అద్భుత వేదిక “మహిళలు ఎవరి అండ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. తమలోని శక్తిని నమ్మి, తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి. జాతీయ...
Read more



