
మాధాపూర్లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సిమ్స్ హాస్పిటల్స్ ప్రారంభించిన ప్రముఖులు..
“ఆరోగ్యమే మహాభాగ్యం” – ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలే లక్ష్యం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
“ఆరోగ్యమే మహాభాగ్యం” అని మన పెద్దలు చెప్పిన మాట ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం అని వక్తలు పేర్కొన్నారు. మనిషికి ఎన్ని ఆస్తులు, సంపదలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ ఉండదని తెలిపారు. సమాజానికి సమగ్ర, నాణ్యమైన, అందుబాటు ధరలో ఆధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మాధాపూర్లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సిమ్స్ హాస్పిటల్స్ ప్రారంభించింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, డాక్టర్ బి. లక్ష్మీకాంతం (రిటైర్డ్ ఐఏఎస్), సత్తార్ ఉమాపతి (రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్), జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు Dundra Kumara Swamy, పీవీ రావు (రిటైర్డ్ ఐఆర్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్), టీవీఎం రావు (రిటైర్డ్ ఐఎఫ్ఎస్) తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజలకు విశ్వసనీయమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే సిమ్స్ హాస్పిటల్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఆధునిక వైద్య మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మూడు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక క్రిటికల్ కేర్ సౌకర్యాలు, 24 గంటల అత్యవసర మరియు అంబులెన్స్ సేవలు, వెంటిలేటర్ మరియు ఆధునిక పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు, నర్సులు మరియు వైద్య సిబ్బంది రోగులకు నిరంతరం సేవలు అందించనున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా Dundra Kumara Swamy మాట్లాడుతూ, “ఎన్ని సంపదలు ఉన్నా అన్నింటికంటే గొప్ప సంపద ఆరోగ్య సంపద. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రతి ఆసుపత్రి ప్రధాన బాధ్యతగా ఉండాలి” అని అన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు, ఆధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన నాణ్యమైన వైద్యులు, సిబ్బందితో సిమ్స్ హాస్పిటల్స్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడం గొప్ప విషయమని అన్నారు.
మెడికల్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ జె మాట్లాడుతూ, ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డయాబెటిస్ చికిత్స, క్రిటికల్ కేర్ మెడిసిన్, అనస్థీషియా & పెరియోపరేటివ్ కేర్, ఎమర్జెన్సీ & ట్రామా కేర్, న్యూరోసర్జరీ, బేరియాట్రిక్ సర్జరీ, ప్రాక్టాలజీ, ప్రసూతి, గైనకాలజీ & ఫెర్టిలిటీ సేవలు, ఆధునిక డయాగ్నస్టిక్ మరియు ఇమేజింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా క్రిటికల్ కేర్ మరియు హై-రిస్క్ సర్జికల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టితో క్లిష్టమైన అత్యవసర పరిస్థితులు, ట్రామా కేసులు మరియు ఆధునిక శస్త్రచికిత్సలను ఒకే చోట అందించే విధంగా ఆసుపత్రిని రూపొందించినట్లు తెలిపారు. మహిళలు మరియు గర్భిణుల కోసం ప్రత్యేక వైద్య సేవలు కూడా ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. కుర్మా రావు మాట్లాడుతూ, ప్రాంత ప్రజలకు మరింత చేరువగా ప్రపంచ స్థాయి వైద్య సేవలను కరుణ, భద్రత మరియు నాణ్యతతో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, ఆధునిక సౌకర్యాల గురించి వివరిస్తూ, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వినూత్న వైద్య సదుపాయాలు మరియు నిపుణుల సేవల ద్వారా రోగి కేంద్రిత వైద్య సేవలను అందించడం పట్ల సిమ్స్ హాస్పిటల్స్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
