బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి
ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ జనార్దన్ గారి సతీమణి అనారోగ్య కారణాలతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సోమరాజు గారు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గారు, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బొడ జనార్దన్ గారితో పాటు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో మనిషికి అండగా నిలవడం, ఆత్మీయతను పంచడం, ధైర్యాన్ని నింపడం కంటే గొప్ప మానవత్వం మరొకటి లేదని పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్ గారి పరామర్శ మరోసారి చాటిచెప్పింది.
ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా బడుగు, బలహీన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేసిన బొడ జనార్దన్ గారి కుటుంబానికి ఈ సమయంలో పలువురు ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమ మద్దతు, ఆత్మీయతను తెలియజేస్తున్నారు.బొడ జనార్దన్ గారి సతీమణి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం.

