తమ వినియోగదారులను ఆకట్టునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. భారత మార్కెట్లోకి షావోమి పోకో ఎఫ్1 ఆర్మౌడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ షావోమి ఎఫ్1 ఆర్మౌడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ రూ. 23,999 అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 26 నుంచి ఈ స్మార్ట్ఫోన్లను పంపిణీ చేస్తామని సంస్థ తెలిపింది. ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్ వెబ్సైట్ల ద్వారా ఈ ఫోన్లను బుక్ చేసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది.
ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more