సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో వినాయక చవితి పురస్కరించుకుని నవ సమాజ్ వినాయక సేవా సదన్ వినాయక పూజా కార్యక్రమములు భక్తిశ్రద్ధలతో సంప్రదాయకంగా నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ఉత్తరాధికారుల సంఘము కో కన్వీనర్ కోవూరి. సత్యనారాయణ గౌడ్ పూజా కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరుడి పూజ వేడుకలను నవ సమాజ్ వినాయక్ సేవా సదన్ బృందంతో కౌండిన్య సంఘం అసోసియేషన్ బృందంతో మరియు భక్త జనులతో కలిసి విజయవంతముగా ఘనంగా జరిపారు .
నవ సమాజ్ వినాయక సేవా సదన్ వినాయకుడి విగ్రహమునకు పది(10) కిలోల లడ్డు మహాప్రసాదాని
కోవూరి అనిల్ కుమార్ గౌడ్ భక్తిశ్రద్ధలతో వినాయకుడికి సమర్పించడం జరిగింది మరియు పూజా కార్యక్రమము తదనంతరము లడ్డు వేలంపాట వేయడం జరిగింది. లడ్డు వేలం పాటలో అధిక సంఖ్యలో భక్తజనులు పాల్గొన్నారు, లడ్డు వేలం పాటలో ఆ యొక్క విఘ్నేశ్వరుడి మహాప్రసాదం అయిన లడ్డును సంగారెడ్డి జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ఉత్తరాధికారులు సంఘము కో కన్వీనర్ కోవూరి.సత్యనారాయణ గౌడ్ అయిదు వేల మూడు వందలకు (5300)తీసుకోవడం జరిగింది .
ఈ సందర్భంలో కోవూరి.సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాధుడు, వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాధాపు అన్ని సంప్రదాయాలలోను అన్ని ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు.
శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోను, భారతదేశం వెలుపల చీనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండొనీడియా వంటి దేశాలలోను కూడా వినాయకుడి అర్చన ఉంది.
వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు – ఏనుగు ముఖం, ఎలుక వాహనం ,అడ్డంకులు తొలగించే గుణం, విద్యా, బుద్ధి ప్రదాత . ధార్మిక, లౌకిక కార్యక్రమాల (వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి) ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం.
వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీ.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది.
తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు (దేవదేవుడు) అనివిశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది.
వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు – గణేశ పురాణము, ముద్గల పురాణము, మరియు గణపతి ముఖ్యమైనవి.
అదే విధముగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా హిందువుల ఐక్యత కోసం, బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర సమరయోధుడు
వినాయక చవితి పది రోజుల సామూహిక పూజా కార్యక్రమాలను నిర్వహించారు .
ప్రస్తుతము ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి పది రోజులు కన్నుల విన్నుల పండుగల రోజురోజుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుని వేడుకలను ఘనంగా గ్రామాలలో, పట్టణాలలో, మండలాలలో, మరియు జిల్లాలలో జరుపుకుంటున్నారు అని తెలియజేశారు . మరియు ఉమ్మడి మెదక్ జిల్లాలో, సదాశివపేట పట్టణంలో, మొట్టమొదటి సారిగా వినాయక చవితి సామూహిక వేడుకలను శ్రీరామ కళామందిరము, బసవేశ్వర మందిరము, సంగమేశ్వర మందిరము, ప్రభు మందిరములలో ప్రారంభించారు .
అదే విధంగా 1986వ సంవత్సరంలో సామాజిక స్పృహ కలిగిన కొంతమంది వ్యక్తులు కలిసి బాలగంగాధర్ తిలక్ ఆశయాల మేరకు హిందు సమాజం పట్ల ఐక్యత కోసం, ప్రజల అభివృద్ధి కోసం, వినాయక చవితి సామూహిక పది రోజుల కార్యక్రమమును జరపాలని సమాజంలో మార్పు తీసుకురావాలని డాక్టర్ వై.వెంకట కృష్ణాగౌడ్ గారిని సంప్రదించి ఈ వినాయక చవితి కార్యక్రమమునకు నామకరణము చేయమని అడిగారు అప్పుడు డాక్టర్ వై. వెంకట కృష్ణ గౌడ్ గారు సమాజం పట్ల ఉన్న సామాజిక స్పృహతో ప్రజలందరికీ న్యాయం జరిగేలా ,ప్రజల ఐక్యత కోసం ఆధ్యాత్మికత కోసం , ప్రజల యొక్క అభివృద్ధి కోసం మరియు పట్టణాభివృద్ధి కోసం, నవ సమాజ్ వినాయక సేవా సదన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నవ సమాజ్ వినాయక్ సేవా సదన్ ముందుండి కార్యక్రమాలను విజయవంతంగా జరుపుచునారు.
ఈ యొక్క కార్యక్రమాలలో కుల, మత, జాతి, విభేదం లేకుండా సదాశివపేట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అని తెలియజేశారు . ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అడ్వకేట్ వై. నాగరాజ్ గౌడ్ గారు , పెద్ద గౌడ్ గారు, కోవూరి అనిల్ కుమార్ గౌడ్, రాఘవేందర్ గౌడ్ , సిహెచ్ మహేశ్వర్ గౌడ్,చిన్న నర్సింహాగౌడ్ , అంజనేయులు గౌడ్ , వై.వీరేందర్ గౌడ్ ,వై. పాలనేత్ర గౌడ్, వై.రమేష్ గౌడ్ కోవూరి.సురేష్ గౌడ్ , వై. రోహిత్ కుమార్ గౌడ్, వై. నరసింహ గౌడ్, వై.సంక్షయ్ గౌడ్, వై.అక్షయ్ గౌడ్, వై.చింటూగౌడ్ మరియు నవ సమాజ్ వినాయక్ సేవా సదన్ మిత్ర బృందం పాల్గొన్నారు .