సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
పట్టభద్రుల ఓటరు జాబితాలో పేరు నమోదు ప్రక్రియ స్థానిక కార్యాలయంనిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయాలి అని,తెలియజేశాడు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చట్టసభల్లో నిర్ణయాత్మక శక్తిగా ఏర్పడాలని పేర్కొన్నారు. అర్హుడైన పట్టభద్రులు విధిగా ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు కోసం అవగాహన సదస్సులు మండల, జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కన్వీనర్ విశాల్ , కోకన్వీనర్ రాధాకృష్ణ , పట్టభద్రులు. పరమేశ్వర్, రామకృష్ణ , విజయ్, పరమాత్మ , శ్రీనివాస్ రెడ్డి , సత్యనారాయణ గౌడ్, రోహిత్.