తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏ ఐ టి యు సి అనుబంధ సంఘం షిరిడి హిల్స్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యము నిత్యావసర సరుకులను ,, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఐలయ్య గారు, 90 మంది భవన నిర్మాణ కార్మికులకు అందజేశారు ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎస్ రత్నం గారు ఏ ఐ టి యు సి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు , వి, హరినాథ్ రావు ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి కే మహేష్, ఉన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జి ఐలయ్య , సిపిఐ పార్టీ పేదలకు అండగా ఉంటుందని పేదల కోసమే పుట్టింది సిపిఐ పార్టీ అని మా జీవితాలు కూడా పేదలకు అంకితమని అన్నారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం షిరిడి హిల్స్ లో స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తి అయిందని అందరూ ఒక మాట మీద ఉండి యూనియన్ లో జమ చేసిన డబ్బుల నుండి ఒక లక్ష రూపాయల బియ్యము నిత్యావసర సరుకులను ఖరీదు చేసి కార్మికులకు అందజేయడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ప్రసాదు శేఖరు మాట్లాడుతూ యూనియన్ స్థాపించినప్పటి నుండి మాకు అండ దండ గా సిపిఐ , ఐలయ్య ఉంటున్నాడని ,ఆయన సలహాలు, సూచనలు పాటించి నందున డబ్బులు జమ చేసుకోగలిగేమని ఈ డబ్బులతోనే ఈరోజు యూనియన్ సభ్యులను సహాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం షిరిడి హిల్స్ అడ్డ అధ్యక్షులు ప్రసాద్ శేఖర్ ప్రధాన కార్యదర్శి, టి ఆంజనేయులు సహాయ కార్యదర్శి బితిరి పాలు క్యాషియర్ ఈ నాగ శేఖర్ ఏం దశరథ కే సోమయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరియు ఇతర భవన నిర్మాణ కార్మికులు. సిపిఐ ఐలయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ,లాక్ డోను ఈ సమయంలో లో ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితమై కరొన అనే మహమ్మారిని తరిమి వేయాలని పిలుపునిచ్చాడు.
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more